Advertisement

ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

Posted : January 14, 2021 at 1:28 pm IST by ManaTeluguMovies

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ పోలీస్‌ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్‌ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్‌, గుంటూరు శ్రీను, జగత్‌ విఖ్యాత్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ విషయంలో.. అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!

Posted : March 23, 2024 at 6:22 pm IST by ManaTeluguMovies

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ విషయంలో.. అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement