Advertisement

కంగనా రనౌత్ కు షాకిచ్చిన ముంబై హైకోర్టు!

Posted : March 1, 2021 at 8:55 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టు భారీ షాకిచ్చింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించిన విషయం తెల్సిందే. జావేద్ అక్తర్ నాయకత్వంలో బాలీవుడ్ లో ఓ కోటరీ ఉంది. వారి కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించింది.

దీనిపై జావేద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ విషయంపై తాను కోర్టులోనే తేల్చుకుంటానని అప్పట్లోనే ఆయన స్పందించారు. తర్వాత అంధేరి కోర్టులో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో మార్చ్ 1వ తేదీన కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

అయితే ఈ సమన్లపై కంగనా రనౌత్ స్పందించకపోవడంతో బాంద్రా కోర్టు తీవ్రంగా స్పందించింది. మార్చ్ 1న కోర్టుకు హాజరుకాకపోవడంతో కంగనాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి ఈ కేసు విచారణ మార్చ్ 26వ తేదికి కోర్టు చేపట్టనున్నారు.


Advertisement

Recent Random Post:

విశాఖ పశ్చిమలో గెలుపెవరిది..? | Vizag | Gelupevaridi | YCP | TDP | Janasena | BJP

Posted : April 15, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

విశాఖ పశ్చిమలో గెలుపెవరిది..? | Vizag | Gelupevaridi | YCP | TDP | Janasena | BJP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement