Advertisement

ప్రభాస్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ వారి బాలీవుడ్‌ మూవీ

Posted : April 16, 2021 at 7:47 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ లో బిగ్గెస్ట్‌ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్‌ లో సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా ప్రభాస్ తో ఒక హిందీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించేందుకు సిద్దం అయ్యారు. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రభాస్‌ హీరోగా నిర్మించబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్‌ వారు చెబుతున్నారు.

ప్రభాస్ మరియు సిద్దార్థ్‌ ఆనంద్‌ ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్న సినిమా కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు గాను బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ అయిన సిద్దార్థ్‌ ఆనంద్‌ కు భారీ ఎత్తున పారితోషికంను ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో పాటు అడ్వాన్స్‌ గా భారీ మొత్తంను ఇవ్వడం జరిగింది. ఇక ప్రభాస్ కు కూడా భారీ మొత్తంలో పారితోషికంను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం ఖాయం. సిద్దార్థ్‌ ఆనంద్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్‌ డైరెక్టర్‌. కనుక ప్రభాస్‌ తో మరో రేంజ్‌ లో సినిమా ఉంటుందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

శ్రీశైలంలో టీడీపీకి గుడ్బై చెప్పిన కీలక నేతలు l TDP Leaders Joined in YCP

Posted : April 15, 2024 at 1:33 pm IST by ManaTeluguMovies

శ్రీశైలంలో టీడీపీకి గుడ్బై చెప్పిన కీలక నేతలు l TDP Leaders Joined in YCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement