Advertisement

నా పేరుతో బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారు జాగ్రత్త

Posted : February 23, 2021 at 3:53 pm IST by ManaTeluguMovies

జబర్తస్త్‌ కామెడీ షో లో సుడిగాలి సుధీర్ టీమ్‌ లో సుదీర్ఘ కాలంగా కమెడియన్ గా కొనసాగుతున్న ఆటో రామ్ ప్రసాద్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి కొందరు అమ్మాయిల నుండి డబ్బులు వసూళ్లు చేయడం, వారి పర్సనల్‌ ఫొటోలు పంపమనడం జరుగుతుందట. ఆ తర్వాత వారు అమ్మాయిలను బ్లాక్ మెయిల్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు అమ్మాయిలు రామ్ ప్రసాద్‌ పేరు వల్ల మోసపోయారంటూ పోలీసుల దృష్టికి వచ్చిందట. దాంతో వెంటనే రామ్‌ ప్రసాద్‌ అలర్ట్ అయ్యాడు.

సోషల్‌ మీడియా ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చాడు. అందులో భాగంగా తన పేరుతో కొందరు వ్యక్తిగత ఫొటోలను షేర్‌ చేయమంటూ కోరుతున్నారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను అడిగాను అని కొందరు అమ్మాయిల ఫొటోలను తీసుకుంటున్నారు. నా పేరుతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించాడు. నా గురించి ఏ విషయం తెలియాలన్నా కూడా నా వ్యక్తిగత ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ను మాత్రమే ఫాలో అవ్వాలంటూ సూచించాడు. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు.


Advertisement

Recent Random Post:

ఇవే నా చివరి ఎన్నికలు.. జగన్ షాకింగ్ కామెంట్స్ | YS Jagan

Posted : March 28, 2024 at 9:02 pm IST by ManaTeluguMovies

ఇవే నా చివరి ఎన్నికలు.. జగన్ షాకింగ్ కామెంట్స్ | YS Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement