Advertisement

హ్యాండ్సమ్ హీరోతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ట్రై చేయబోతున్నారా.?

Posted : January 9, 2021 at 7:46 pm IST by ManaTeluguMovies


అక్కినేని అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి గత చిత్రాల మాదిరిగా ‘#అఖిల్5’ ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్ ‘కిక్’ ‘రేసుగుర్రం’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తారట. ఇందులో అఖిల్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ అందరి రెమ్యూనరేషన్లతో కలిపి 60 కోట్లు పైనే అవ్వచ్చని టాక్. ఇదే కనుక నిజమైతే ఇంత పెట్టుబడి అఖిల్ సినిమా మీద పెట్టి వెనక్కి తీసుకోవాలంటే సినిమాపై ఎక్కడా నెగిటివ్ టాక్ అన్నదే రాకుండా చూసుకోవాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అఖిల్ సరసన ముంబై మోడల్ సాక్షి వైద్యని హీరోయిన్ గా తీసుకున్నారని.. కాదు రష్మిక మందన్నా హీరోయిన్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చి దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Posted : April 22, 2024 at 6:17 pm IST by ManaTeluguMovies

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement