ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టైగర్ నాగేశ్వరరావు.. రియాలిటీకి లోతుగా..

మాస్ మహారాజు రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై రోజురోజుకు అంచనాలు చాలా పాజిటివ్ గా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మాస్ రాజా ఎన్నో కమర్షియల్ అలాగే కామెడీ సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడి నుంచి ఒక స్టువర్ట్ పురం గజదొంగ స్టోరీ వస్తూ ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి పెరిగిపోయింది.

ఒకప్పుడు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెర పైకి రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇక విడుదలైన సాంగ్స్ అంతగా బజ్ క్రియేట్ చేయకపోయినప్పటికీ ఈ సినిమా కంటెంట్ మాత్రం చాలా బలంగానే ఉండబోతున్నట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది.

ముఖ్యంగా రవితేజ లుక్కు మాత్రం మామూలుగా లేదు అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంతే కాకుండా వెండితెరపై అలనాటి స్టువర్ట్ పురం వాతావరణమే కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నారని కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా మరింత లోతుగా కాస్త సినిమాటిక్ వెర్షన్ లో కూడా దర్శకుడు థ్రిల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా సినిమా కు సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేశారు అందులో గుడిసె కు సంబంధించిన సెట్ చాలా హైలెట్ గా నిలిచింది. ఎంట్రీ లోనే జంతువుల పుర్రెలు కనిపించే విధంగా హైలెట్ చేశారు. ఇక మరోవైపు ట్రైన్ కు సంబంధించిన గ్రాఫిక్స్ ను గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే స్టువర్ట్పురంలో ఒకప్పుడు నివసించిన తీరును సినిమాలో చూపించబోతున్నట్లు ఉన్నారు.

రియాలిటీ కి దగ్గరగా ఉండేలా గుడిసెలను కూడా ప్రత్యేకంగా సినిమా కోసం నిర్మించినట్లుగా తెలుస్తోంది. సినిమా థ్రిల్ అనిపించే విధంగా దర్శకుడు వంశీ చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. మరి సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నుపూర్ సనోన్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.

Exit mobile version