ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అను లెవెల్ అంతకంతకూ పడిపోయిందిగా

అను ఇమ్మాన్యుయేల్.. 2016లో నాని సరసన మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైందీ భామ. మజ్ను సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత అను.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గోపీచంద్ ఆక్సిజన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అను ఇమ్మాన్యుయేల్ అజ్ఞాతవాసి సినిమాలో ఎంపికవ్వడంతో ఆమె దశ తిరిగిపోతుందని అంతా భావించారు. అయితే ఆ చిత్రం దారుణమైన ప్లాప్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పీడకలలు తెచ్చిన సినిమా ఇది. అయినా అనుకు అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలో నటించింది అను. ఈ సినిమా కూడా ఫ్లాపే.

ఇద్దరు పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ప్లాపవ్వడంతో అను రేంజ్ కొంచెం కిందకు దిగింది. మిడ్ రేంజ్ హీరో నాగ చైతన్యతో శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. చేసిన సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అను కు అందం ఉన్నా, గ్లామర్ పరంగా అభ్యంతరాలు చెప్పకపోయినా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 2018లో శైలజ రెడ్డి అల్లుడు సినిమా చేసిన తర్వాత ఆమెకు టాలీవుడ్ అవకాశాలు లేవు. 2019లో ఒక్క తమిళ సినిమాలో మాత్రం నటించింది.

తాజా సమాచారం ప్రకారం అను ఇమ్మాన్యుయేల్.. మెగా హీరో అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో రేంజ్ నుండి అల్లు శిరీష్ రేంజ్ కు పడిపోయింది ఈ భామ. అయితే ఈ సినిమాతో హిట్ అందుకుంటే మళ్ళీ అవకాశాలు అందుకోవడం పెద్ద కష్టమేం కాబోదు.

Exit mobile version