Advertisement

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆలస్యం అయినా త్రివిక్రమ్‌ నిర్ణయం అదేనట

Posted : April 18, 2020 at 8:40 pm IST by ManaTeluguMovies

అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను కొట్టిన త్రివిక్రమ్‌ తదుపరి చిత్రంను ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. ఎన్టీఆర్‌ 30 చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటన కూడా వచ్చింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా త్రివిక్రమ్‌ ఈ ఏడాది చివరి వరకు ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టలేక పోవచ్చు. అందుకే త్రివిక్రమ్‌ ఈ గ్యాప్‌లో మరో సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా వస్తున్న పుకార్లపై త్రివిక్రమ్‌ సన్నిహితులు స్పందించారు. ఎన్టీఆర్‌తోనే త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం ఉంటుంది. మరే హీరోతో కూడా త్రివిక్రమ్‌ చర్చలు జరపడం లేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం అనుకున్న సమయంకు పూర్తి అవుతుందని నమ్మకంగా ఉన్నాం. ఆ సినిమా షూటింగ్‌ ఆలస్యం అయినా కూడా త్రివిక్రమ్‌ మరో సినిమాను చేయడంటూ వారు చెప్పుకొచ్చారు.

ఖచ్చితంగా ఇదే ఏడాదిలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కం, వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో అరవింద సమేత చిత్రం వచ్చి నిరాశ పరిచింది. దాంతో ఈసారి నందమూరి ఫ్యాన్స్‌ చాలా నమ్మకం పెట్టుకుని మరీ త్రివిక్రమ్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడిని విలన్‌గా తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్‌గా పూజా హెగ్డేనే నటించే అవకాశాలున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

దొరికిన దొంగల** | TDP Kesineni Chinni REVEALED REAL FACTS Behind Stone ATTACK on CM Jagan

Posted : April 18, 2024 at 1:05 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement