ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఔను మాది గిరిజన కుటుంబమే

మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ఫిదాతో అందరిని ఫిదా చేసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తున్నా కూడా డబ్బుకు ఆశపడకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కొన్నే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇక సాయి పల్లవి గురించిన ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అదే సాయి పల్లవి ఒక గిరిజన జాతికి చెందిన అమ్మాయి అని, అచ్చంగా చెప్పాలి అంటే ఆమె ఒక లంబాడా జాతికి చెందిన అమ్మాయి అనేది ఆ వార్త సారాంశం.

తాజాగా సాయి పల్లవి ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్నట్లుగా మా కుటుంబం గిరిజన జాతికి చెందిన కుటుంబమే అంటూ పేర్కొంది. తమిళనాడుకు చెందిన బడుగ అనే గిరిజన తెగ మాది. మేము మాట్లాడుకునే భాషకు లిపి ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ విషయంలో తాను దాయాలని అనుకున్నది లేదు, నా తెగ గురించి నేను దాచి పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు అంది.

హీరోయిన్‌ ప్రస్తుతం వస్తున్న పలు ఆఫర్లలో ఎక్కువగా కమర్షియల్‌ పాత్రలు ఉంటున్నాయి. అందుకే నేను పాత్రకు ప్రాముఖ్యత ఉన్న వాటిల్లోనే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్‌ స్టోరీ ఇంకా వేణు ఉడుగుల దర్శకత్వంలో రానాతో కలిసి చేస్తున్న విరాట పర్వం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Exit mobile version