ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కిరణ్ అబ్బవరానికి అండగా అఖిల్.. ప్లస్ అయ్యేనా!

యువ హీరో కిరణ్ అబ్బవరం కశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను కూడా పూర్తి చేసేసుకుంది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 18న మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే శివరాత్రికి విడుదల కావాల్సిన సమంత శాకుంతలం విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. తాజాగా వినరో భాగ్యము విష్ణుకథ రిలీజ్ డేట్ మారడం టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కిరణ్ అబ్బవరం నటించే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తుందడనంలో సందేహం లేదు. ఈ హీరో నటించే సినిమాలకు సగటు ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. ఈయన తాజా చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్ ట్రైలర్ల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.

అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో.. మేకర్స్ ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ వేడుకకు కుర్ర హీరో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా రానున్నారని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరానికి అండగా.. ఈ కుర్ర హీరో నిలవనున్నారు. అయితే అఖిల్ కెరియర్లో సరైన హిట్స్ కూడా లేవు. కాకపోతే.. కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందనే చెప్పాలి. అంతగా క్రేజ్ లేని హీరో.. ఈ సినిమా ప్రిరిలీజ్కు ఎంత వరకు ప్లస్ అవుతాడో చూడాలి.

ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్గానే ఉంది. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మించారు. ఇక చూడాలి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో అని.

Exit mobile version