ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తెలుసు కదా.. ఎంతవరకు వచ్చిందంటే..

ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సిద్దు జొన్నలగడ్డ తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాతో తెలుసు కదా అనే సినిమాని స్టార్ట్ చేశారు. నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర తెలుసు కదా సినిమాని నిర్మిస్తోంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇదిలా ఉంటే బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో తెలుసు కదా మూవీ నుంచి సిద్దు షూటింగ్ పూర్తి చేసాడంట.

తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేశారు. 30 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేసి కీలక సన్నివేశాలతో పాటు హీరో, హీరోయిన్ మీద సాంగ్ ని చిత్రీకరించడం జరిగిందని మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ తో సిద్దు జొన్నలగడ్డ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందంట. దాంతో పాటు సినిమా మేజర్ కంటెంట్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నీరజ కోన ఎన్నో హిట్ సినిమాలకి వర్క్ చేశారు. ఇప్పుడు తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా తన ప్రతిభ నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా కథ, కథనం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయనే మాట వినిపిస్తోంది. సిద్దు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెలుసు కదా సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. సినిమా షూటింగ్ కి సంబందించిన ఫోటోలని మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో నీరజ కోనతో పాటు శ్రీనిధి శెట్టి, సిద్దు జొన్నలగడ్డ ఉన్నారు. టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

రౌడీ బాయ్స్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయంట. సిద్దు జొన్నలగడ్డ తనదైన కామెడీ ఈ చిత్రంలో కూడా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

Exit mobile version