Advertisement

బాలీవుడ్ బడా నిర్మాత కూతురికి కరోనా

Posted : April 6, 2020 at 7:39 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడింది. సోమవారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి నెగిటివ్ రావడంతో కనికా కపూర్‌ను ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారు వైద్యులు. అయితే ఈలోపు బాలీవుడ్ బడా నిర్మాత కరీం మొరాని కూతురు షాజా మొరాని కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరింది. బాలీవుడ్ స్టార్ షారుక్‌కు ఎంతో సన్నిహితుడైన కరీం మొరాని… ‘రా.. వన్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలకు నిర్మాతగా వ్యవహారించారు.

ఈ మధ్య ఆస్ట్రేలియా నుంచి ముంబైకి తిరిగివచ్చిన షాజా… వచ్చినప్పటి నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. షాజాను ఐసోలేషన్ వార్డుకు పంపిన అధికారులు, ఆమె కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. షాజా మొరాని ఆస్ట్రేలియాలో తన బాయ్ ఫ్రెండ్ ప్రియాంక్ శర్మతో కలిసి ఎంజాయ్ చేసినట్టు తెలిసింది. దీంతో ప్రియాంక్‌కి కూడా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత ఎంత మందిని కలిసారు, ఎక్కడెక్కడికి వెళ్లారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

విదేశాల నుంచి వచ్చినవారు ముందు జాగ్రత్తగా 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించినా బడా బాబుల వారసులు పట్టించుకోవడం లేదు. కరోనా పాజిటివ్‌గా తేలిన కనికా కపూర్, లండన్ నుంచి వచ్చిన తర్వాత వివిధ పార్టీల్లో పాల్గొనగా, కరీం కూతురు షాజా లక్షణాలు కన్పించేదాకా యథేచ్ఛగా తిరిగి చాలామంది ప్రాణాలను రిస్క్‌లో పడేసింది.


Advertisement

Recent Random Post:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Posted : March 27, 2024 at 11:40 am IST by ManaTeluguMovies

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement