Advertisement

బైక్ పై స్టార్ హీరో ఆధ్యాత్మిక యాత్ర!

Posted : September 15, 2022 at 10:03 pm IST by ManaTeluguMovies


స్టార్ హీరోలు కాస్ట్ లీ కార్స్ అంటే అమితంగా ఇష్టపడుతుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ అజిత్ కు మాత్రం స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం. బైక్స్ పై ట్రావెల్ చేయడం.. దూర ప్రదేశాలకు వెళ్లడం అంటే అజిత్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుంటారు. రీసెంట్ గా హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘వలిమై’. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటించిన ఈ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మించారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తరువాత దర్శకుడు అజిత్ హెచ్. వినోద్ తో కలిసి అజిత్ మరో భారీ యాక్షన్ డ్రామాని చేస్తున్నారు. ఈ సినిమాని కూడా బోనీ కపూర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అజిత్ 61 వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్నఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఇటీవలే ప్రారంభించారు. అయితే కీలక ఘట్టాల చిత్రీకరణ అనంతరం షూటింగ్ కు బ్రేకిచ్చారు.

ఈ బ్రేక్ టైమ్ ని హీరో అజిత్ మైక్ పై ఆధ్యాత్మక యాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. అజిత్ తో పాటు మలయాళ హీరోయిన్ మంచు వారియర్ కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొందని చెబుతున్నారు. అజిత్ బైక్ పై లద్దాఖ్ వరకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇటీవల మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కూడా ఈ టూర్ కి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుని అజిత్ సార్ తో కలిసి అడ్వెంచరస్ డైడ్ కి వెళ్లడం గౌరవంంగా వుంది అని షేర్ చేసింది.

తాజాగా ఈ ఆధ్యాత్మిక టూర్ లో భాగంగా స్టార్ హీరో అజిత్ బద్రినాథ్ కేదార్ నాథ్ టెంపుల్స్ ని దర్శించుకున్నారు. కేదార్ నాథ్ టెంపుల్ ద్వారం వద్ద ఫొటోలకు పోజులిచ్చిన అజిత్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 51 ఏళ్ల వయసులో తనదైన స్వాగ్ తో స్టైలిష్ గా కనిపిస్తున్న అజిత్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అజిత్ నటిస్తున్న 61వ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది.

భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. బ్యాంకాక్ లో కీలక యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించనున్నారట. ఇందు కోసం సెప్టెంబర్ 15న చిత్ర బృందం బ్యాంకాక్ చేరుకోనుందని తెలిసింది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలిసింది.


Advertisement

Recent Random Post:

Viswam First Strike | Gopichand | Sreenu Vaitla | TG Vishwa Prasad | People Media Factory

Posted : April 11, 2024 at 5:59 pm IST by ManaTeluguMovies

Viswam First Strike | Gopichand | Sreenu Vaitla | TG Vishwa Prasad | People Media Factory

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement