ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మరో వెయ్యి కోట్ల మూవీ లోడింగ్‌..!

ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో బిగ్గెస్ట్‌ సినిమాల జాబితాలో చేరిన విషయం తెల్సిందే. దాదాపు పుష్కర కాలంగా లేని సక్సెస్ ను షారుఖ్ ఖాన్‌ పఠాన్ తో దక్కించుకోవడం తో ఒక్కసారిగా బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల మేకర్స్ కూడా అవాక్కయ్యారు.

పఠాన్ హిట్ కేవలం గాలి వాటం అనుకుంటున్న వారికి ఇటీవల విడుదల అయిన జవాన్‌ సినిమా తో షారుఖ్ సమాధానం చెప్పాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమా ఏకంగా రూ.1100 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు దక్కించుకున్న హీరో అంటూ షారుఖ్‌ ఖాన్‌ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కేవలం రెండే కాదు మూడవ వెయ్యి కోట్ల మూవీ కూడా రాబోతుంది అంటూ షారుఖ్ అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. రాజ్ కుమార్‌ హీరానీ దర్శకత్వంలో రూపొందిన షారుఖ్ ఖాన్‌ డుంకీ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో యశ్‌ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ లో జాయిన్‌ అయ్యారు.

అంతర్జాతీయ మార్కెట్‌ లోని డుంకీ హక్కులను యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ వారు హోల్‌ సేల్‌ గా కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఢీల్ విలువ అత్యంత ఖరీదైనదిగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఓవర్సీస్ మార్కెట్‌ లోనే యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ వారికి రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కనుక వెయ్యి కోట్ల వసూళ్లు పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి మాట. డిసెంబర్‌ లో ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రాబోతుంది. తాప్సి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీ నటులు నటించారు.

Exit mobile version