ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రానాతో తేజ… ఫ్యాన్స్ కి టెన్షన్ పెట్టే పుకార్లు

హీరో రానా నుండి ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు రావడం లేదు. ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సిరీస్ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఆ విషయం పక్కన పెడితే సినిమాల విషయంలో దగ్గుబాటి అభిమానులను రానా నిరాశకు గురి చేస్తూనే ఉన్నాడు. ఫలితం తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రానా త్వరలో రాక్షస రాజు అనే సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తేజ గత చిత్రం ‘అహింస’ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో రానా తో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అహింస సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రానా మరియు తేజల సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.

రాక్షస రాజు సినిమా ను ఒక్క పార్ట్ కాదు.. రెండు పార్ట్ లుగా తీసుకు వచ్చేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. హీరో రానా కూడా అందుకు ఓకే అన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రానా మరియు తేజ కాంబోలో సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. రెండు పార్ట్ లకు సంబంధించిన ఒకే సారి షూట్ చేస్తారట.

చాప్టర్ 1.. చాప్టర్ 2 గా రాక్షస రాజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవల విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా ఒకే సారి షూట్ ను ముగించి రిలీజ్ మాత్రం రెండు భాగాలుగా చేయడం జరిగింది. అదే విధంగా రానా సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది.

ఒక సినిమా రెండు భాగాలుగా రావడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ గా జరుగుతుంది. కానీ అలా వచ్చిన సినిమాలు నిరాశ పర్చుతూ వస్తున్నాయి. రానా రాక్షస రాజు సినిమా రెండు పార్ట్ లుగా వచ్చి ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో అనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తుంది.

Exit mobile version