ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ వాలంటీర్లకు పోటీగా తన కార్యకర్తలను రంగంలోకి దించింది. అలాగే వైసీపీకి ఓట్లేయకుంటే పథకాలు రావని ఎవరైనా బెదిరిస్తే.. అలాంటివారి సమాచారం తమకు ఇవ్వాలని, అలా ఇచ్చినవారి ఖాతాలో రూ.10వేలు వేస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తిరుపతిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వైసీసీకి ఓటేయకుంటే పథకాలు రావంటూ బెదిరించేవారి గుట్టు రట్టుచేయాలన్నారు.
7557557744 వాట్సాప్ నంబర్ కు ఆ కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే.. సంబంధిత వ్యక్తుల అకౌంట్ లో రూ.10వేలు జమ చేస్తామని స్పష్టంచేశారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని, అవి ప్రజల డబ్బులని పేర్కొన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ కు బుద్ది చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.