ఈ చిత్ర షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతుందని మొదట ప్లాన్ వేసుకున్నారు. మొత్తంగా ఇన్ డోర్స్ లోనే గ్రీన్ మ్యాట్ సాంకేతికతను ఉపయోగించి చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆదిపురుష్ షూటింగ్ ఆగిపోయింది.
ఇప్పట్లో మహారాష్ట్రలో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆదిపురుష్ షూటింగ్ ను ముంబై నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో షూటింగ్ కు తగినట్లుగా సెటప్ ను మారుస్తున్నారట. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.