రీసెంట్ గా అల్లు అరవింద్ నిర్మాణంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. అల్లు అరవింద్ సొంత సినిమా కాబట్టి కచ్చితంగ ఆహాలో ప్రదర్శింపబడుతుందని అందరూ భావించారు.
అయితే అందరికీ షాక్ ఇస్తూ అరవింద్ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కు అమ్మేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ భారీ అమౌంట్ ను కోట్ చేయడంతో కాదనలేక ఈ నిర్ణయం తీసుకున్నాడట. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే.