ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘ఫ్యామిలీ’ కోసం ఒక్కటైన అమితాబ్, రజినీ, చిరు.!

దేశానికి లేదా రాష్ట్రానికి ఎలాంటి చిన్న విపత్తు వచ్చినా సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లేలా చేసింది. దీనికోసం ఇప్పటికే మన టాలీవుడ్ తారలు భారీగా విరాళాలు అందించారు. అలాగే మెగాస్టార్ చిరు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ’ని స్థాపించి పనిలేక ఇబ్బందిపడుతున్న సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు.

ఇది కాకుండా ఆఇంట్లోనే ఉంటూ చిరు, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కోటి కలిసి ఓ సాంగ్ షూట్ చేశారు, దానికి ప్రధాని మోదీ నుంచి కూడా ప్రశంశలు వచ్చాయి. ఇప్పుడు దానికి మించి ఇండియన్ సినీ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా ఆల్ ఇండియా సూపర్ స్టార్స్ అంతా కలిసి 4 నిమిషాల 35 సెకన్ల నిడివి గల ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు.

ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘ఫ్యామిలీ’. దీని కథాంశంలోకి వెళితే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో తన సన్ గ్లాసెస్ కనిపించట్లేదు అని వర్రీ అవుతుంటే దిల్జీత్ దొసాంజ్ వచ్చి నేను వెతికి పెడతా అని వెతుకుంటూ ఇంట్లోని అందరినీ అడుగుతుంటారు. అక్కడ మన ఇండియన్ స్టార్స్ ఒక్కొక్కరుగా వస్తుంటారు. ఫైనల్ గా ప్రియాంక చోప్రా సన్ గ్లాసెస్ అమితాబ్ కి ఇచ్చి ఇప్పుడెందుకు మీకు సన్ గ్లాసెస్ అని అడిగితే.. ఇప్పుడప్పుడే బయటకి వెళ్లే పరిస్థితి లేదు, సో ఇలా వదిలేస్తే పాడైపోద్ది, సో నేను సేఫ్ గా పెట్టుకుంటా అని సమాధానం ఇస్తాడు. ఇలా అందరూ కలిసి ఈ లాక్ డౌన్ టైంలో ఎవరూ ఇంటినుంచి బయటకి రావద్దు ఇంట్లోనే ఉంటూ మీరు మీ ఫామిలీ సేఫ్ గా ఉండండి అనే మెసేజ్ ని ఇచ్చారు.

ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, రన్బీర్ కపూర్, దిల్జీత్ దొసాంజ్, శివరాజ్ కుమార్, ప్రోసెంజిత్, అలియా భట్, ప్రియాంక చోప్రా, సోనాలిలు నటించారు. ఇంట్లోనే కూర్చొని ఇలాంటి ఓ షార్ట్ ఫిల్మ్ చేసి ఎంటర్టైం చేస్తూ, ప్రజలకి అవగాహన కలిగిస్తుండడం వలన అందరూ సూపర్ స్టార్స్ ని మెచ్చుకుంటున్నారు.

Exit mobile version