Advertisement

కేబుల్ బ్రిడ్జీ అందాలను చూస్తూ మురిసిన బన్నీ పిల్లలు

Posted : July 23, 2021 at 2:01 pm IST by ManaTeluguMovies

సెలబ్రెటీలు వారి స్టార్‌ స్టేటస్ వల్ల బయటకు రావడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. బయటకు వచ్చిన సమయంలో వారిని జనాలు చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు బయటకు ఎక్కువగా వచ్చేందుకు ఇష్టపడరు. పిల్లలతో బయటకు వెళ్లడం అంటే అది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందుకే విదేశాల్లో ఫ్యామిలీతో సెలబ్రెటీలు చక్కర్లు కొడుతూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్‌ తన భార్య మరియు పిల్లలతో అలా సరదాగా సిటీ రైడ్‌ చేశాడు.

హైదరాబాద్‌ లో టూరింగ్ స్పాట్‌ గా మారిన కేబుల్‌ బ్రిడ్జిని తన పిల్లలకు చూపించేందుకు అల్లు అర్జున్‌ అటుగా కార్లో తీసుకు వెళ్లాడు. కారు ఆపకుండానే మెల్లగా వెళ్లనిస్తూ ఉండగా పిల్లలు కేబుల్‌ బ్రిడ్జి అందాలను చూసి మురిసి పోయారు. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు పిల్లలు కూడా కేబుల్‌ బ్రిడ్జీని చూసి మురిసి పోతున్న సమయంలో వారి వీడియోను స్నేహా రెడ్డి తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.


Advertisement

Recent Random Post:

KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire

Posted : April 12, 2024 at 8:14 pm IST by ManaTeluguMovies

KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement