ఆహా ఈ చిత్రాన్ని రూ.1.8 కోట్లకే కొన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా ‘థాంక్ యూ బ్రదర్’ కోసం అనసూయ తీసుకున్న పారితోషికం వివరాలు లీకయ్యాయి. 17 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉంటే.. ఆమె ఒక్క రోజుకే రూ.1.5 లక్షలు తీసుకుందట. అంటే మొత్తంగా పాతిక లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనసూయ గర్భిణిగా నటిస్తోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.