ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అనసూయ మలయాళ చిత్రానికి అదనపు స్క్రీన్లు

అనసూయ నటించిన రెండు సినిమాలు ఇటీవల 50కోట్ల క్లబ్ ని అధిగమించాయి. ఒక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు హిందీలో 100కోట్లు వసూలు చేయగా.. మరో సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరి 80 కోట్ల వరకూ వసూలు చేస్తుందన్న అంచనాలు అందుకుంది. ఈ రెండిటిలో అనసూయ నటనకు పేరొచ్చింది. ఓవరాల్ గా ఇదంతా అనసూయ మహిమేనా? అంటే.. అవుననే అభిమానులు అంటున్నారు.

ఇంతకీ డబుల్ సెంచరీ కొట్టిన సినిమా ఏదీ? అంటే.. అల్లు అర్జున్ పుష్ప. ఇందులో అనసూయ బ్లేడ్ బాబ్జీకి సిస్టర్ గా నటించింది. కనిపించింది కొద్దిసేపే అయినా బ్లేడ్ తో కుర్రకారు గొంతు కోసేసింది. సునీల్ పాత్ర ఎగ్జిట్ కి కారణమైంది.

ఇకపోతే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం `భీష్మ పర్వం` ఇటీవలే విడుదలై హిట్ కొట్టింది. ఈ సినిమాతో అనసూయ మలయాళంలోకి కూడా ప్రవేశించింది. ఇందులో ఎంతో సాఫ్ట్ గా కళ్లద్దాలు ధరించి చీరకట్టులో ఎంతో ఒద్దికగా కనిపించింది అనసూయ.

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మార్కును క్రాస్ చేయడంతో పాటు వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెండో వారంలో కూడా 30 కోట్లు వస్తాయని మేకర్స్ మరోసారి అంచనా వేస్తున్నారు.

అనసూయ కీలక పాత్రలో నటించగా ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. మునుముందు తెలుగులో పలు క్రేజీ చిత్రాలు విడుదల కానున్నాయి. కెరీర్ పరంగా చూస్తే అనసూయ పెద్ద తెర బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రేజీ భారీ చిత్రాల్లో అనసూయ నటించారు.

ఆచార్య సహా రంగ మార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అనసూయ నటించారు. తమిళం మలయాళం కన్నడలోనూ ఆఫర్లు అందుకుంటున్నారు.బుల్లితెరపై జబర్ధస్త్ యాంకర్ గానూ అనసూయ బిజీగా కెరీర్ ని సాగిస్తున్నారు. వీటితో అనసూయ రేంజు మరింత పెరగనుంది. పుష్ప 1 లో కనిపించిన అనసూయ పుష్ప 2లోనూ నటించనున్నారు. పుష్ప 2లోనూ దాక్షాయని పాత్రకు ఎక్స్ టెన్షన్ ఏ రేంజులో ఉండనుందో వేచి చూడాలి.

Exit mobile version