Advertisement

యాంకర్‌ శ్రీముఖిపై పోలీసులకు ఫిర్యాదు

Posted : May 5, 2020 at 5:10 pm IST by ManaTeluguMovies

తెలుగు బుల్లి తెర టాప్‌ యాంకర్స్‌ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పలు షోలతో ఈమె ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లి తెరపై శ్రీముఖి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. ఆమె ఏ షో చేసినా కూడా ప్రేక్షకులు ఆ షోకు భారీ రేటింగ్‌ ఇస్తూ ఉంటారు. పటాస్‌ షోకు ఏ స్థాయిలో రేటింగ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈమె కొత్త షోకు రెడీ అవుతుంది. ఈ సమయంలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. లాక్‌డౌన్‌లోను ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రయత్నించిన శ్రీముఖి తాజాగా ఒక కేసులో ఇరుక్కుంది.

శ్రీముఖిపై బంజారహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నల్లకుంటకు శర్మ ఫిర్యాదు ఇచ్చాడు. బ్రహ్మణులను అవమానపర్చే విధంగా శ్రీముఖి ప్రవర్తించిందంటూ తన ఫిర్యాదులో శర్మ పేర్కొన్నాడు. బ్రహ్మణుల మనోభావాలను శ్రీముఖి దెబ్బ తీసిందని ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరాడు. ఆయన తన ఫిర్యాదులో శ్రీముఖినే కాకుండా జెమిని టీవీ యాజమాన్యంను కూడా చేర్చాడు. ఆ ఛానెల్‌లోనే ప్రసారం అయిన ఆ కార్యక్రమం తమ మనోభావాలను దెబ్బ తీసింది అన్నాడు.

ఇంతకు ఆ కార్యక్రమం ఏంటీ, శర్మ ఏ విషయంలో పోలీసులను ఆశ్రయించాడు అనేది ప్రస్తుతం బుల్లి తెర వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. శ్రీముఖి చాలా జోవియల్‌గా ఉంటుంది. ఆమె తీరు ఎవరిని మెప్పించే విధంగా ఉండదు. కాని ఉన్నట్లుండి ఆమెపై కేసు నమోదు అవ్వడంతో ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.


Advertisement

Recent Random Post:

హిందూపురం సీటు విషయంలో తగ్గేదేలే : Paripoornananda Swami | AP Elections 2024 –

Posted : March 28, 2024 at 11:59 am IST by ManaTeluguMovies

హిందూపురం సీటు విషయంలో తగ్గేదేలే : Paripoornananda Swami | AP Elections 2024 –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement