ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయెల్ రోల్లో కనిపించబోతున్నారనే, అందులో ఒకటి అఘోరా పాత్రనే వరాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను అఘోరా పాత్రని ఖరారు చేశారు. ‘అవునండి ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తున్న మాట వాస్తవమే.. కానీ ఎలా మేము తెరపైకి తీసుకు రాబోతున్నాం అనేదే సస్పెన్స్.. బాలయ్య లాంటి స్టార్ ని అలా చూపించడం అంత ఈజీ కాదు.. కానీ గతంలో రెండు సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేసేశాం.. సో ఆ రెండిటికి పొంతన లేకుండా ఓ సరికొత్త పాత్ర చెయ్యాలనే అఘోరా పాత్ర తీసుకున్నాం.. కచ్చితంగా అందరినీ థ్రిల్ చేసేలానే పాత్ర ఈ కథ ఉంటుందని’ బోయపాటి శ్రీను తెలిపారు.
ఈ లాక్ డౌన్ కారణంగా వారణాశిలో షూట్ చేయాలనుకున్న అఘోరా ఎపిసోడ్స్ కి కూడా వేరే ప్రత్యామ్న్యాన్ని వెతికే పనిలో ఉంన్నారు బోయపాటి అండ్ టీం. బాలయ్య సరసన అంజలిని ఓ హీరోయిన్ గా అనుకుంటుండగా, మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ని మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.