అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ లో గోపీచంద్ మలినేని ఉన్నాడు. అఖండ సినిమాకు రెండు వారాల షెడ్యూల్ తో గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది. చరిత్రలో నిలిచి పోయే ఒక పాత్రను ఉపయోగించి దాని చుట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అల్లి సినిమా గా తీయడంలో గోపీచంద్ ఇప్పటికే క్రాక్ ద్వారా సక్సెస్ అయ్యాడు. కనుక పల్నాటి నేపథ్యంలో రూపొందబోతున్న బాలయ్య సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.