అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక గోపీచంద్ మలినేని కాస్టింగ్ ప్రాసెస్ ను మొదలుపెట్టాడు. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నాడు.
సీనియర్ హీరోయిన్ టబును మరో కీలక పాత్ర కోసం అడగ్గా ఆమె నిర్మొహమాటంగా నో చెప్పినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో టబు చెన్నకేశవరెడ్డి సినిమాలో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో సీనియర్ హీరోయిన్ ను అనుకుంటున్నారు.