సోహెల్ కుటుంబ సభ్యులు కూడా తీసుకోవాలని సూచించారు. దాంతో మరో ఆలోచన లేకుండా తీసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అయిదు లక్షలు అనాధ ఆశ్రమానికి మరో అయిదు లక్షలు మెహబూబ్ కు ఇస్తాను అంటూ పేర్కొన్నాడు. నాకు వద్దు అనాధలకే ఇద్దాం అంటూ మెహబూబ్ కూడా అనడంతో వారిద్దరి బాండింగ్ నచ్చిన నాగార్జున మీ ఇద్దరికి నేను 10 లక్షలు ఇస్తానంటూ చెప్పాడు. దాంతో సోహెల్ గెలుచుకున్నది 35 లక్షలు అయ్యింది. అంటే విన్నర్ గా నిలిచిన వారి కంటే సోహెల్ కు ఎక్కువ వచ్చింది. మంచి మనసు చాటుకున్న నాగార్జునకు సోహెల్ మరియు మెహబూబ్ లు పాదాభివందనం చేశారు. సోహెల్ నిర్ణయంను అంతా అభినందిస్తున్నారు.