Advertisement

బిగ్‌బాస్‌ తెలుగు-5 : సరయు వెళ్లిపోతూ ఉగ్రరూపం చూపింది – ఎపిసోడ్ -8

Posted : September 13, 2021 at 11:58 am IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్‌ 5 నుండి మొదటి వారం సరయు వెళ్లి పోబోతున్నట్లుగా మేము ఇప్పటికే చెప్పిన విషయం రీడర్స్ కు తెల్సిందే. మాకు అందిన సమాచారం నిజం అయ్యింది. సరయు ఎలిమినేట్ అయ్యింది. అంతా జెస్సీ లేదా కాజల్ అనుకుంటున్న సమయంలో సరయుకు తక్కువ ఓట్లు రావడంతో ఆమెను ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. బిగ్‌ బాస్ లో ఈమద్య కాలంలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ సరయు అంటూ అంతా అనుకున్నారు. కాని సరయు గురించి పెద్దగా ఎవరికి తెలియక పోవడమో లేదా మరేంటో కాని ఆమెను జనాలు పట్టించుకోకుండా ఉండటం వల్ల ఓట్లు దక్కలేదు. దాంతో ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది. రెండు మూడు వారాల వరకు ఆమె ఎలిమినేషన్‌ కు నామినేట్ అయ్యి ఉండకుంటే ఆమెను జనాలు అర్థంచేసుకుని ఉండేవారు. అప్పుడు ఆమెకు ఖచ్చితంగా ఓట్లు పడేవి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సరయు వెళ్లి పోవడానికి ముందు ఇంటి సభ్యులతో సన్ డే ఫన్‌ డే అంటూ ఆట ఆడించాడు. అంతా కూడా క్యాట్‌ వాక్ చేశారు. క్యాట్‌ వాక్ కు జెస్సీ మార్కులు ఇచ్చాడు. ఇంటి సభ్యులు క్యాట్‌ వాక్‌ ను అదరగొట్టారు. ఒకొక్కరు ఒక్కో రకంగా తమ విధానంను చూపించారు. డాన్స్ తో కొందరు రొమాన్స్ తో కొందరు ఎంటర్ టైన్ చేశారు. మొత్తానికి బిగ్‌ బాస్ సండే ఎపిసోడ్‌ ఫన్ గా సాగింది. లోబో ఎంటర్‌ టైన్ మెంట్‌ తో పాటు శ్రీరామ చంద్ర మరియు సిరిల రొమాన్స్ ఇంకా ప్రియా గారి పంచ్‌ లు అన్ని కలిపి నాగార్జున సరదాగా షో ను సాగించాడు. అన్ని విధాలుగా ఆదివారం నాటి ఎపిసోడ్‌ ఆకట్టుకుంది.

మద్య మద్యలో ఒకొక్కరిని సేవ్‌ చేస్తూ వస్తూ చివరకు సరయును ఎలిమినేట్‌ చేశారు. ఎలిమినేట్‌ అయిన సరయు నాగార్జున వద్దకు వెళ్లి స్టేజ్‌ మీద నుండి ఇంటి సభ్యులతో మాట్లాడింది. ఆ సమయంలో అయిదుగురు ఉత్తములు మరియు అయిదుగురు వరస్ట్ ఇంటి సభ్యుల గురించి చెప్పమంటూ సరయుకు సూచించడం జరిగింది. దాంతో బెస్ట్‌ గా తనకు ఇష్టమైన శ్వేత, మానస్‌, ప్రియాంక, విశ్వ మరియు హమీదాల పేర్లను చెప్పింది. వారు తన మనసులో ఉండి పోతారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక వరస్ట్‌ కంటెస్టెంట్స్ విషయంలో మొదటగా అందరూ ఊహించినట్లుగానే సిరిని పెట్టింది. సిరిపై ఓ రేంజ్‌ లో సరయు ఫైర్ అయ్యింది.

సరయు వ్యాఖ్యలను సిరి చాలా సింపుల్‌ గా లైట్ తీసుకున్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత సన్నీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సన్నీతో నేను సినిమాలో నటించాను. ఆ సమయంలోనే అతడు నాపై గర్జ్ పెట్టుకున్నాడు. అది ఇప్పుడు చూపించాడు అంటూ సరయు సీరియస్ అయ్యింది. లహరి ని ఓ రేంజ్ లో టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేసింది. ఆమె తీరు అస్సలు బాగా లేదు అంటూ కోపంతో ఊగిపోయిన సమయంలో లహరి స్పందిస్తూ నువ్వు కోపంలో ఉన్నావు. నేను ఏమీ అనలేను అంది. ఆ తర్వాత షణ్ముఖ్ మరియు కాజల్ లను కూడా వరస్ట్‌ గా పెట్టింది. సరయు వెళ్లి పోవడంతో ఇంట్లో ఇంకా 18 మంది మిగిలి పోయారు. నేటి నుండి ఆట ఎలా ఉంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న జగన్ బస్సు యాత్ర | CM YS Jagan Bus Yatra

Posted : April 13, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న జగన్ బస్సు యాత్ర | CM YS Jagan Bus Yatra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement