Advertisement

బిగ్ బాస్ 5: కెప్టెన్ తప్ప అందరూ నామినేషన్స్ లోకి

Posted : November 16, 2021 at 12:06 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 5 కీలకమైన దశకు చేరుకుంది. పదకొండో వారంలోకి ఎంటర్ అయింది ఈ షో. ఆదివారం జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లిపోవడంతో అసలు వెళ్లిపోవాల్సిన కంటెస్టెంట్ కు లైఫ్ దక్కింది. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పటిలానే మంచి ఫైర్ తో సాగింది. రెగ్యులర్ గా ఉన్నట్లుగానే గార్డెన్ ఏరియాలో ప్రతీ ఒక్కరూ ఇద్దరేసి కంటెస్టెంట్స్ చొప్పున స్లైమ్ పోసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా కెప్టెన్ రవితో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. రవి – సన్నీ, కాజల్ లను నామినేట్ చేసాడు. శనివారం ఎపిసోడ్ లో బ్రేక్ మధ్యలో తనతో డిస్కషన్ పెట్టినందుకు సన్నీని, తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినందుకు కాజల్ ను నామినేట్ చేసాడు.

ఆ తర్వాత షణ్ముఖ్ వచ్చి నువ్వు హౌజ్ లో లేకపోతే గొడవలు జరగవు అన్న పెద్ద స్టేట్మెంట్ ను కాజల్ పై ఇచ్చి నామినేట్ చేసాడు. ప్రియాంక లూజ్ టాక్ నచ్చలేదని ఆమెను నామినేట్ చేసాడు. మానస్ – షణ్ముఖ్, ఎన్నీ మాస్టర్ లను నామినేట్ చేసాడు. షణ్ముఖ్ ఎక్కువ ఊహించుకుంటున్నాడని కారణం చెప్పాడు. ఎన్నీ మాస్టర్ హగ్ విషయం ఎత్తి నామినేట్ చేసాడు.

శ్రీరామ్ అందరూ అనుకున్నట్లుగానే సన్నీ, మానస్ లను నామినేట్ చేసాడు. ముందు నుండీ కూడా వీరిద్దరికీ శ్రీరామ్ కు చిన్న గ్యాప్ మైంటైన్ అవుతూ వస్తోంది. షణ్ముఖ్ అన్న మాట తాను తీసుకోలేకపోతున్నానని చెప్పి తననే నామినేట్ చేసింది కాజల్. అలాగే కొన్ని వారాలుగా ఎన్నీ మాస్టర్ పడట్లేదు కాబట్టి ఆమెను కూడా నామినేషన్స్ లో వేసింది. తనను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయని కారణంగా ప్రియాంకను, రెండో నామినేషన్ గా కాజల్ ను ఎంచుకుంది సిరి. ప్రియాంక తనను నామినేట్ చేసిన ఇద్దరూ షణ్ముఖ్, సిరిలను తిరిగి నామినేట్ చేసింది. తన కెప్టెన్సీ టాస్క్ లో అడ్డు పడినందుకు సిరిని నామినేట్ చేసాడు సన్నీ. అలాగే శ్రీరామ్ ను నామినేట్ చేసాడు. ఇక చివరిగా వచ్చిన ఎన్నీ మాస్టర్ మానస్, కాజల్ లను నామినేట్ చేసింది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో ఎన్నీ మాస్టర్ చేసిన డ్యాన్స్ లు, వెక్కిరించడం హౌజ్ మేట్స్ లో కొంత మందికి నవ్వు, కొంత మందికి ఏంటిది అన్న ఫీలింగ్ ను కలిగించాయి.

మొత్తంగా కెప్టెన్ రవి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.


Advertisement

Recent Random Post:

ఏపీలో హీరో ఎవరో, విలన్‌ ఎవరో ప్రజలు తెలుసుకోవాలి : CM YS Jagan | Memantha Siddham

Posted : April 24, 2024 at 8:28 pm IST by ManaTeluguMovies

ఏపీలో హీరో ఎవరో, విలన్‌ ఎవరో ప్రజలు తెలుసుకోవాలి : CM YS Jagan | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement