Advertisement

బిగ్ బాస్ 5: గెలుపు దిశగా దూసుకెళ్తోన్న సన్నీ రాజ్యం- ఎపిసోడ్ 32

Posted : October 7, 2021 at 12:17 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ 5 లో ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. సన్నీ, రవిలకు రెండు రాజ్యాలు ఇచ్చి వారిలో ఎవరో ఒకరే రాజు అవుతారని, ఏ రాజుకి ఎక్కువ మంది మద్దతు ఇస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ప్రజలలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని అన్న విషయం తెల్సిందే. రవి, సన్నీలు వారి వారి స్ట్రాటజీలు ఉపయోగించుకుని ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక ప్రజలు కూడా వారి వారి స్ట్రాటజీలు వారు ఆడుతున్నారు.

ఈరోజు జరిగిన మొదటి టాస్క్ లో ఇరు రాజ్యాలకు మద్దతు ఇచ్చే ప్రజలు మడ్ పిట్ లో పోటీ పడాల్సి ఉంటుంది. రవి టీమ్ నుండి విశ్వ రాగా సన్నీ టీమ్ లో మానస్ మొదటిగా పోటీ పడ్డారు. ఇందులో విశ్వ గెలుపొందాడు. రెండో రౌండ్ కోసం కొంత కాంట్రవర్సీ అయింది. రవి టీమ్ నుండి లేడీ కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి సన్నీ టీమ్ నుండి వారినే పంపాలని కోరగా సన్నీ దానికి ససేమీరా అన్నాడు. దీంతో జెస్సీతో పోటీ పాడటానికి అన్నీ మాస్టర్ రాగా ఆమెను సులువుగానే ఓడించేసాడు. ఇక మూడో రౌండ్ పింకీ, శ్వేతాల మధ్య పోటీ జరగ్గా శ్వేతా నెగ్గింది. మూడు రౌండ్స్ లో రెండు గెలిచినందుకు రవి రాజ్యం గెలుపొందింది. వారికి 150 కాయన్లు ఇచ్చారు.

ఇక రెండో టాస్క్ గా రెండు గోడలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసారు. రవి, సన్నీలలో ఎవరికి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలను ఆ గోడపై పెట్టాల్సి ఉంటుంది. బజర్ మోగేసమయానికి ఎవరి ఫోటోలు అయితే ఎక్కువ ఉంటాయో వారే విజేతలు. సన్నీ టీమ్ నుండి మానస్, జెస్సీ పోటీ పడగా రవి టీమ్ నుండి శ్రీరామ్ చంద్ర, విశ్వ పోటీ పడ్డారు. ఈ టాస్క్ కొంత ఫిజికల్ అయింది. శ్రీరామ్ చంద్ర మోచేతులకు దెబ్బలు తగలగా శ్రీరామ్ చంద్ర మోచేతితో జెస్సీను కొట్టాడు. అయితే చివరికి సన్నీ టీమ్ విజయం సాధించింది.

మూడో టాస్క్ టగ్ ఆఫ్ వార్ గా ప్రకటించారు. ఈ టాస్క్ లో కూడా సన్నీ టీమ్ విజయం సాధించింది. శ్రీరామ్ చంద్ర ఈ టాస్క్ కోసం మానస్ ను సంచలకునిగా ప్రకటించగా దానికి సన్నీ టీమ్ ఒప్పుకోలేదు. దీంతో హమీదను సంచలకురాలిగా ప్రకటించాడు శ్రీరామ్ చంద్ర. ఈ టాస్క్ లో విజయం సాధించడం ద్వారా సన్నీ రాజ్యం పైచేయి సాధించింది. ఇక ఎపిసోడ్ మొత్తం ఎప్పటికప్పుడు, ఎవరికి వారు సందు దొరికితే డబ్బాలో నుండి డబ్బులు దొంగతనం చేసి వారి కాయిన్లు పెంచుకునే ప్రయత్నం చేసారు. రేపు ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుంది.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Posted : April 20, 2024 at 11:39 am IST by ManaTeluguMovies

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement