మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేస్తారని.. పది పరిక్ష పేపర్లు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. లీకేజీ కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తేలేదని అన్నారు. తప్పు చేయలేదని ఆయా వ్యక్తులు నిరూపించుకోవాలని అన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 60 మందిని అరెస్టు చేశారని.. తప్పు చేయకపోతే ఎందుకు అరెస్టు చేస్తారని మంత్రి ప్రశ్నించారు.