Advertisement

రేణిగుంట ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు అవమానం

Posted : June 13, 2021 at 8:36 pm IST by ManaTeluguMovies

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. తిరుపతి విమానాశ్రయంలో రన్ వేకు వెళ్లే రెండో వీఐపీ గేట్ వద్ద ఆయన్ను కేంద్ర భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పీయూష్ గోయల్‌కు బుగ్గన వీడ్కోలు పలకలేకపోయారు. తాను రాష్ట్ర మంత్రిని అని చెప్పినా సిబ్బంది వినకుండా తోసేసినట్టు తెలుస్తోంది. తిరుమల పర్యటన అనంతరం పియూష్ గోయల్ తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. మంత్రి సెక్యూరిటీ ఎంత చెప్పినా లిస్టులో పేరు లేనందువల్ల పంపలేమని విమానాశ్రయ సిబ్బంది తేల్చి చెప్పారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానంతరం రేణిగుంట ఎయిర్ పోర్టులో పియూష్ గోయల్ కు వీడ్కోలు పలికేందుకు బుగ్గన వెళ్లారు. అయితే.. ఎయిర్ పోర్టు డైరక్టర్ నిర్లక్ష్యం వల్లే మంత్రి పేరు లిస్టులో లేదని తిరుపతి ఆర్డీఓ వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ మేనేజర్ కూడా డైరక్టర్ పర్మిషన్ లేనిదే తామేం చేయలేమని స్పష్టం చేశారు.


Advertisement

Recent Random Post:

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Posted : April 19, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement