ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు..! వైసీపీ అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్, మిట్టపల్లి టీడీపీ నాయకుడు మంజునాథ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంజునాధ్, మనోహర్.. ఇద్దరూ తమను బెదిరిస్తున్నారిని వైసీపీ అభ్యర్ధి క్రిష్ణమూర్తి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణలను మనోహర్‌ కొట్టిపారేశారు. తనకు మంజునాథ్ ఎవరో కూడా తెలియదని.. ఇదంతా వైసీపీ కుట్ర అని అన్నారు.

అవసరమైతే మంజునాథ్, తన కాల్‌డేటాలను పరిశీలించుకోవచ్చన్నారు. తనపై అన్యాయంగా మోపిన కేసులపై కోర్టులో తేల్చుకుంటానని మనోహర్ స్పష్టం చేశారు. వీరిపై కేసులు పెట్టడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. కుప్పం మండలంలో 26 పంచాయతీలకు 74 మంది పోటీ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి రెబల్స్ ఎక్కువగా పోటీ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి.

Share

Exit mobile version