ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కేవలం ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రమే సఫలం అవుతారనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతిస్తుంది. కరోనా కో హరానా హై అనే పేరుతో రూపొందబోతున్న ఈ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారిలో చైతన్యం తీసుకు వస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కో హరానా హై కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, టాలీవుడ్ నుండి చిరంజీవి, తమిళం నుండి ఆర్య కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి నుండి పునీత్ రాజ్ కుమార్ ను ఈ కార్యక్రమంకు ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరితో ఒక చిన్న డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నారు.