Advertisement

ద్విపాత్రాభినయంలో అలరించనున్న చిరంజీవి

Posted : July 25, 2021 at 7:02 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాలను ఫైనల్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా లూసిఫెర్ రీమేక్ ను చేయనున్నాడు చిరంజీవి. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇది కాకుండా దర్శకుడు బాబీ స్క్రిప్ట్ కు కూడా చిరు ఓటేశాడు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఇందులో డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. గతంలో చాలా సినిమాల్లో చిరు డ్యూయల్ రోల్ చేసాడు. అవన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించనున్నాడు చిరు. ఇటీవలే బాబీ చిరును కలిసి స్టోరీ లాక్ చేసుకున్నాడని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

పోతిన మహేశ్‌ దారెటు..?

Posted : March 28, 2024 at 11:31 am IST by ManaTeluguMovies

పోతిన మహేశ్‌ దారెటు..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement