ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మరోసారి చిరు ఔన్నత్యం.. ఇక బాలయ్య వ్యాఖ్యలకు చెక్ పడినట్లేనా?

‘నన్ను ఎవరూ పిలవలేదు.. మీటింగులు పెట్టుకొని భూములు పంచుకుంటున్నారా?’ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఎంత దుమారం లేపాయో అందరికీ తెలిసిన సంగతే.. ఆ తర్వాత పలు మీడియా వేదికల్లో ఇండస్ట్రీ రెండుగా(ఒకటి చిరంజీవి వర్గం, మరొకటేమో బాలకృష్ణ సపోర్ట్ వర్గం అంటూ) చీలిపోయిందంటూ.. వార్తలు వచ్చాయి. బాలకృష్ణ తన జన్మదినం సందర్భంగా పలువురు మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడమే కాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జరిగిన భేటీకి కూడా ఎవరో తనకి చెప్పారని, పిలవాల్సిన వాళ్ళు తనని పిలవలేదని బాలయ్య వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీనే చిరంజీవి గారిని సెలక్ట్ చేసుకోవడం వల్ల ఆయన ఓ ‘పెద్దన్నయ్య’లా ముందుడి అన్నీ చేస్తున్నారు. కాబట్టి, బాలయ్య చేసిన వ్యాఖ్యలకు వల్లే వేస్తూ ఆ పిలవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవేనని ఫిలిం నగర్ వర్గాలతో పాటు, పలువురు మీడియా వేదికల్లో చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీ బాగు కోసమే నా ప్రయత్నం అనుకున్న చిరంజీవి గారు మాత్రం ఇవేం పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకూ చిరు స్పందించకపోవడంతో కొందరు మీడియా వారు దీనిని రాజకీయపరమైన యాంగిల్లో కూడా చూపించి క్యాష్ చేసుకుంటున్నారు.

ఎప్పుడూ ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ, పదుగురిని కలుపుకుంటూ పోయే మెగాస్టార్ చిరంజీవి, ఈ వివాదాలకు అతీతంగా మరోసారి తన ఔన్నత్యాన్ని చూపారు. నేడు బాలయ్య పుట్టిన రోజు.. ఈ రోజు ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా బాలకృష్ణకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మొట్ట మొదటి స్టార్ చిరంజీవి గారే కావడం విశేషం.

’60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నానని’ చిరు పోస్ట్ చేశారు.

Exit mobile version