అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబో మూవీ పుష్ప ను మొన్నటి వరకు మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆచార్య సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 7వ తారీకున షూటింగ్ ను ప్రారంభించి దాదాపుగా రెండు లేదా మూడు వారాల పాటు అక్కడే చిత్రీకరణ జరుపబోతున్నారు. చిరంజీవి మరియు రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ షెడ్యూల్ లో ఆమె కూడా నటించబోతుంది.