ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎక్స్‌క్లూజివ్‌ః ‘ఆచార్య’ కోసం చిరు, చరణ్‌ లు అక్కడకు వెళ్లబోతున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సైరా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ కోసం యూనిట్‌ సభ్యులు ఇప్పటికే భారీ సెట్టింగ్‌ ను వేయడం జరిగింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక వచ్చే వారంలో ఈ సినిమా కోసం చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లు రాజమండ్రి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబో మూవీ పుష్ప ను మొన్నటి వరకు మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆచార్య సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 7వ తారీకున షూటింగ్‌ ను ప్రారంభించి దాదాపుగా రెండు లేదా మూడు వారాల పాటు అక్కడే చిత్రీకరణ జరుపబోతున్నారు. చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లపై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ షెడ్యూల్‌ లో ఆమె కూడా నటించబోతుంది.

Exit mobile version