రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పదవి విరమన వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచినట్లుగా కూడా కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పెంపు తక్షణమే వర్తిస్తుందన్నారు. కమిటీ సిఫార్సు చేసినదాని కంటే కూడా అధనంగా ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చినట్లుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయమై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి పీఆర్సీని ప్రకటించబోతున్నట్లుగా కూడా కేసీఆర్ తెలియజేశారు.