ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఫిట్‌మెంట్‌ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని.. ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ పద్దతిన పని చేస్తున్న వారికి కూడా ఈ ఫిట్‌మెంట్ ను ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యం ఈ ప్రకటన చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పదవి విరమన వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచినట్లుగా కూడా కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పెంపు తక్షణమే వర్తిస్తుందన్నారు. కమిటీ సిఫార్సు చేసినదాని కంటే కూడా అధనంగా ప్రభుత్వం పీఆర్‌సీ ఇచ్చినట్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయమై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి పీఆర్‌సీని ప్రకటించబోతున్నట్లుగా కూడా కేసీఆర్‌ తెలియజేశారు.

Exit mobile version