ఓపక్క హుజూరాబాద్ ఎన్నిక దగ్గరకొస్తోంది. గవర్నర్ కూడా ఫైల్ వెనక్కి పంపడం లేదు. వెనక్కి పంపిస్తే.. మళ్లీ కౌశిక్ నే క్యాబినెట్ ప్రతిపాదిస్తూ ఫైల్ పంపితే గవర్నర్ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ఫైల్ లో కదలిక లేకపోయింది. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి ఎదురై 12 మంది ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. మరి.. కేసీఆర్ ఒక్క ఎమ్మెల్సీ కోసం కోర్టుకు వెళ్తారా.. కౌశిక్ కల నెరవేరుస్తారా..? అనేది తేలాల్సి ఉంది.