Advertisement

‘ఉప్పెన’ ఫలితాన్ని బట్టి కొండపొలం పై క్రిష్‌ నిర్ణయం

Posted : January 29, 2021 at 3:13 pm IST by ManaTeluguMovies

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన‘ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. గత ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదా పడింది. విడుదల ముంగిట వాయిదా పడ్డ ఉప్పెనను ఓటీటీ వారు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కాని మేకర్స్ మాత్రం వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా కనుక థియేటర్‌ రిలీజ్ కే మొగ్గు చూపించారు. ఎట్టకేలకు ఉప్పెన సినిమా విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఉప్పెన విడుదలకు ఉండగానే వైష్ణవ్‌ తేజ్ కొండ పొలం సినిమాను క్రిష్ దర్శకత్వంలో పూర్తి చేశాడు.

కొండ పొలం నవల ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. మొదటి నుండి కూడా ఆ సినిమాను ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈమద్య వరుసగా సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. దానికి తోడు నూరు శాతం ఆక్యుపెన్సీకి రంగం సిద్దం అయ్యింది. కనుక ఈ సినిమాను మొదట థియేటర్‌ లో విడుదల చేసి ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేస్తే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నాడట. అయితే ఉప్పెన సినిమా సూపర్‌ హిట్ అయితే థియేటర్‌ రిలీజ్‌ కు వెళ్లాలి అనేది కొందరి వాద. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొండ పొలం వర్క్‌ అంతా దాదాపుగా పూర్తి అయ్యింది.


Advertisement

Recent Random Post:

CM Jagan Great Words About Dharmana Krishna Das in Tekkali Public Meeting

Posted : April 24, 2024 at 6:04 pm IST by ManaTeluguMovies

CM Jagan Great Words About Dharmana Krishna Das in Tekkali Public Meeting

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement