ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్న క్లాసిక్‌ డైరెక్టర్‌

టాలీవుడ్‌లో మహర్షి, అన్వేషణ, సితార, లేడీస్‌ టైలర్‌, ఔను వాళ్లిదరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి వంటి క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీ. ఈయన ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తెరకెక్కించడంలో విఫలం అవుతున్నాడు. దాంతో ఈయనకు ఆఫర్లు తక్కువ అయ్యాయి. ఈమద్య కాలంలో ఈయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడినది. దాంతో సినిమా మేకింగ్‌ పై వంశీ ఆసక్తిగా లేడంటూ ప్రచారం జరుగుతోంది.

సినిమాలు కాకుండా ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించేందుకు దర్శకుడు వంశీ రెడిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ కోసం స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ వంశీ దర్శకత్వంలో ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు రెడీగా ఉంది. మీడియం బడ్జెట్‌తో వంశీ మార్క్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ వెబ్‌ సిరీస్‌లో పలువురు ప్రముఖ నటీనటులతో పాటు కొత్త వారు కూడా కనిపించబోతున్నారు. ఇక వంశీ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే కొందరు నటీనటులు ఇందులో కనిపించబోతున్నారు. అలాగే వంశీ సినిమాలు ఎక్కువగా గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కాయి. సెంటిమెంట్‌ కోసం ఈ వెబ్‌ సిరీస్‌లో కొన్ని సీన్స్‌ను కూడ గోదావరి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించే అవకాశం ఉందట. క్లాసిక్‌ డైరెక్టర్‌ కొత్త జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.

Exit mobile version