Advertisement

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత #divya

Posted : July 13, 2020 at 2:53 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో పాటు మరికొందరు వివిధ కారణాల వల్ల మృతి చెందిన విషయం తెల్సిందే. తాజాగా మరో బాలీవుడ్‌ స్టార్‌ దివ్య చోక్సే క్యాన్సర్‌ తో పోరాడుతూ మృతి చెందింది. 2016 సంవత్సరంలో హై అప్నా దిల్‌ తో అవారా చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈమె గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌ తో పోరాటం చేస్తోంది.

దివ్య చోక్సే మృతికి కొన్ని గంటల ముందు తన సోషల్‌ మీడియా పేజ్‌ లో ఒక మెసేజ్‌ ను షేర్‌ చేసింది. అందులో నేను చెప్పదల్చుకున్న విషయానికి ఈ మెసేజ్‌ సరిపోదు. నేను కొన్ని నెలలుగా క్యాన్సర్‌ తో పోరాటం చేస్తున్నాను. బెడ్‌ పై ఉండి జీవితంను గడుపుతున్నాను. మరికొన్ని గంటల్లో నేను మృతి చెందవచ్చు అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ అందరికి రీచ్‌ అయ్యేప్పటికే ఆమె మృతి చెందింది.

పలు టీవీ షోల్లో మరియు సినిమాల్లో కనిపించి కొద్ది సమయంలోనే బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న దివ్య మృతితో బాలీవుడ్‌ వర్గాల వారు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో వర్క్‌ చేసిన పలువురు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ శ్రద్దాంజలి ఘటించి ఆమెతో జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.


Advertisement

Recent Random Post:

Remand Report On Accused Satish In Attack On CM Jagan Case

Posted : April 18, 2024 at 6:31 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement