Advertisement

టాలీవుడ్‌ పై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

Posted : September 28, 2020 at 10:54 pm IST by ManaTeluguMovies

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలు డ్రగ్స్‌ కేసులతో అల్లాడి పోతున్నాయి. బాలీవుడ్‌ తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారు పలువురు ఇప్పటికే అరెస్ట్‌ అవ్వగా టాలీవుడ్‌ కు చెందిన వారు కూడా డ్రగ్స్‌ కేసుతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకురాలు.. సినీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ రంగంలో అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు డ్రగ్స్‌ కు అలవాటు పడ్డారు. ప్రముఖుల పిల్లలు డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారు. సినీ రంగంలో రాణించాలంటే డబ్బు ఉండాలి. సినిమా పరిశ్రమలో ఆఫర్లు దక్కించుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఉన్నది ఏంటీ.. ఆఫర్లు లేకుండా కనిపించకుండా పోయిన ప్రణీతకు లేనిది ఏంటీ అంటూ దివ్యవాణి ప్రశ్నించారు. హైదరాబాద్‌ లో కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల కూడా డ్రగ్స్‌ రాకెట్ నడుస్తోంది అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమద్య మొదలు పెట్టిన డ్రగ్స్‌ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది అనే విషయంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడించాలంటూ ఆమె డిమాండ్‌ చేసంది.


Advertisement

Recent Random Post:

Delhi Liquor Scam Case Updates : ఇవాళ్టితో ముగియనున్న కవిత ED కస్టడీ

Posted : March 23, 2024 at 11:55 am IST by ManaTeluguMovies

Delhi Liquor Scam Case Updates : ఇవాళ్టితో ముగియనున్న కవిత ED కస్టడీ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement