ధృవ్ దంపతులిద్దరికీ స్వల్ప కరోనా లక్షణాలున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్నే ఆయన తెలిపాడు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము క్షేమంగా తిరిగి వస్తామని అభిమానులకు ధైర్యం చెప్పాడు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరాడు.
గత నెలలో ధృవ్ అన్న చిరంజీవి సర్జా గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. చిరంజీవి కుటుంబం ఆ బాధ నుంచి తేరుకోకుండానే ఆ కుటుంబంలో భార్యాభర్తలు కరోనా బారిన పడడం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది.