వీరి వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఛైర్మన్ తుల ఉమ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వీరు కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలపై భూకబ్జా, దేవరయాంజల్ భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ఈటల రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్ కు రాబోయే ఉప ఎన్నికపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ భార్య జమున పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.