ఇలాంటి నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. కొన్నేళ్ల క్రితమే వెబ్ సిరీస్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ, రాధికా ఆప్టే లాంటి నటీనటులు నటించారు. కరణ్ జోహార్ వంటి వారు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ రోల్ పై పెద్ద చర్చే నడిచింది. బోల్డ్ నెస్ కు పరాకాష్టగా నిలిచింది వెబ్ సిరీస్.
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో తీస్తున్నారు. ఒక వెర్షన్ కోసం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆ ఎపిసోడ్ లో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ త్వరలో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి ఈషా రెబ్బ స్పందించింది. తన రోల్ బోల్డ్ గా ఉంటుంది కానీ స్కిన్ షో అసలు ఉండదని క్లారిటీ ఇచ్చింది. గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండానే బోల్డ్ నెస్ ను చూపించారని తెలిపింది.