Advertisement

గంటా కుమార్తె ఇంట దొంగతనం

Posted : January 21, 2021 at 6:51 pm IST by ManaTeluguMovies

మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత ఇంట్లో దొంగలు పడ్డారు. సంక్రాంతికి సాయి పూజిత అత్తవారింటికి భీమవారం వెళ్లిన సమయంలో దొంగలు బంగారం మరియు వెండి అభరణాలను దొంగిలించారు. దాదాపుగా పది లక్షల రూపాయల సొత్తును దొంగలు ఎత్తుకు వెళ్లినట్లుగా పోలీసు ఫిర్యాదు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే సాయి పూజిత ఇంట్లో పని చేసే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిని విచారించి దొంగతనం తాలూకు వివరాలు తెలుసుకుంటున్నారు.

సాయి పూజిత భర్తతో కలిసి రుషికొండలోని బాలాజీ బేమౌంట్ విల్లాలో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా అత్తవారిల్లు అయిన భీమవరం వెళ్లారు. అక్కడ నుండి తండ్రి గంటా ఇంటికి వెళ్లింది. ఏదో పని మీద ఒక వ్యక్తిని రుషికొండలోని తన సొంత ఇంటికి పంపించగా అప్పటికే అక్కడ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగి ఎంక్వౌరీ మొదలు పెట్టారు.


Advertisement

Recent Random Post:

పోతిన మహేశ్‌ దారెటు..?

Posted : March 28, 2024 at 11:31 am IST by ManaTeluguMovies

పోతిన మహేశ్‌ దారెటు..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement