ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..

ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా హాజరయ్యారు. దీంతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది. ఈ వివాహ వేడుకకు సినీ హీరో ఆర్.నారాయణ మూర్తి కూడా హాజరయ్యారు. సినీ, రాజకీయ నాయకులతో పెళ్లి మండపం కోలాహలంగా మారింది.

గోరటి వెంకన్నకు ఇటివలే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. గవర్నర్ కోటాలో ఈ అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ వివాహానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పెళ్లి వేడుక నుంచి సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

Exit mobile version