తెలంగాణ అమలు చేసిన మిషన్ భగీరధ, రైతు బంధును కేంద్రం కాపీ కొట్టింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 7778 మెగా వాట్ట విద్యుత్ ఉత్పత్తి ఉంటే.. ఇప్పుడు 16వేలకు పెరిగింది. తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటు కంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధంచిన వృద్ధి రేటు ఎక్కువ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు.