అప్పట్లోనే ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. అందుకే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వం సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా అద్బుతం అన్నట్లుగా దర్శకుడు తెరకెక్కించాడని మేకర్స్ మరియు నటీ నటులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా ఈ సినిమా కల కంటున్న మణిరత్నం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. చోళ రాజుల కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.